తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల సాధన కోసం జూలై 17న రైల్ రోకో కార్యక్రమానికి పిలుపునిచ్చినట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. బీసీ రిజర్వేషన్ బిల్లుపై బీజేపీపై ఒత్తిడి తీసుకురావాలని కోరుతూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేకు లేఖ రాస్తున్నట్లు కవిత పేర్కొన్నారు. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మెతక వైఖరి అవలంబిస్తోందని కవిత ఆరోపించారు.