తోపుడు బండ్ల వ్యాపారులకు శుభవార్త.. ఆ వసూళ్లు రద్దు.. నాదెండ్ల మనోహర్ ప్రకటన

4 months ago 19
గుంటూరు జిల్లా తెనాలి మున్సిపాలిటీ పరిధిలోని తోపుడు బండ్ల వ్యాపారులకు మంత్రి నాదెండ్ల మనోహర్ శుభవార్త వినిపించారు. తోపుడు బండ్ల వ్యాపారులు ఇకపై ఆశీలు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని ప్రకటించారు. ఆశీలు పేరుతో జరిగే వసూళ్లను రద్దు చేస్తున్నట్లు మంత్రి సోమవారం వెల్లడించారు. ఈ నిర్ణయం ఈ రోజు నుంచే అమల్లోకి వస్తుందని తెలిపారు. మంత్రి తీసుకున్న నిర్ణయంపై తోపుడు బండ్ల వ్యాపారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Read Entire Article