దేశవ్యాప్తంగా కలకలం రేపిన సికింద్రాబాద్ బొల్లారం మద్రాస్ రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. చోరీకి గురైన ఆయుధాలను మాజీ ఆర్మీ అధికారి నివాసంలో స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. మహబూబ్ నగర్లో గురువారం రాత్రి సమయంలో టాస్క్ఫోర్స్ పోలీసులు వీటిని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. దీనిపై ఇవాళ, లేదా రేపు పోలీసులు విలేకర్ల సమావేశం నిర్వహించనున్నట్లు తెలిసింది.