'త్వరగా లాగ్ అవుట్ అయి ఇళ్లకు వెళ్లిపోండి'.. ఉద్యోగులకు హైదరాబాద్ పోలీసుల సూచన

10 months ago 16
హైదరాబాద్‌ నగరంలో కుండపోత వర్షాల నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు జారీ చేశారు. నేడు సాయంత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున.. ఐటీ ఉద్యోగులు మధ్యాహ్నం 3 గంటల నుంచే లాగ్ అవుట్ కావాలని కోరారు. ఇది ఉద్యోగుల భద్రతకు, ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి, అత్యవసర సేవలకు సహాయపడుతుందని తెలిపారు. ప్రజలు సురక్షితంగా ఉండాలని, అవసరం లేని ప్రయాణాలను మానుకోవాలని పోలీసులు ట్వీట్ ద్వారా విజ్ఞప్తి చేశారు.
Read Entire Article