హైదరాబాద్ నగరంలో కుండపోత వర్షాల నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు జారీ చేశారు. నేడు సాయంత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున.. ఐటీ ఉద్యోగులు మధ్యాహ్నం 3 గంటల నుంచే లాగ్ అవుట్ కావాలని కోరారు. ఇది ఉద్యోగుల భద్రతకు, ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి, అత్యవసర సేవలకు సహాయపడుతుందని తెలిపారు. ప్రజలు సురక్షితంగా ఉండాలని, అవసరం లేని ప్రయాణాలను మానుకోవాలని పోలీసులు ట్వీట్ ద్వారా విజ్ఞప్తి చేశారు.