త్వరలో తెలంగాణలో ఉప ఎన్నికలు జరగబోతున్నాయ..? స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి సంకేతాలు ఇచ్చారా..? అయితే నేడు స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి దీని గురించి సంకేతాలు ఇచ్చారు. రూ. 800 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి.. శివునిపల్లి వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇక్కడకు తాను వచ్చింది త్వరలో జరగబోయో ఎన్నికల్లో ఒట్లు అడగడానికో.. ఓట్లు వేయడానికో కాదు అంటూ.. పరోక్షంగా ఎన్నికల గురించి ప్రస్తావించారు.