వరంగల్ మామునూరు విమానాశ్రయ పునరుద్ధరణ పనులు త్వరలో ప్రారంభించనున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఇప్పటికే భూసేకరణ పూర్తయిందని.. డీపీఆర్ వచ్చిన తర్వాత పనులు మొదలవుతాయని వెల్లడించారు. కాగా, ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 300 ఎకరాల భూమిని కేంద్ర మంత్రిత్వ శాఖకు అప్పగించింది. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ ప్రాజెక్టును చేపట్టనుంది. కాగా, రెండేళ్లన్నరలో ఈ ఎయిర్పోర్టు నిర్మాణం పూర్తవుతుందని అంచనా.