గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల్లో నందమూరి నటసింహం బాలకృష్ణను పద్మభూషణ్ వరించిన సంగతి తెలిసిందే. అయితే.. తనకు పద్మభూషణ్ రావటంపై బాలకృష్ణ తొలిసారి స్పందించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని నివాసానికి వెళ్లిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బాలకృష్ణ.. పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.