Alleti Maheshwar Reddy: తెలంగాణలో రాజకీయ పరిస్థితులు రోజురోజుకు రంజుగా మారుతున్నాయి. నిత్యం అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య విమర్శలు, ఆరోపణలు, సవాళ్లు నడుస్తూ.. రాజకీయాన్ని రక్తికట్టించే పనిలో ఉన్నారు. అయితే.. ఈసారి మరో కొత్త ఆరోపణ తెరమీదికి వచ్చింది. త్వరలోనే తెలంగాణ సీఎం మార్పు ఉంటుందని.. కొత్తగా వచ్చిన మీనాక్షి నటరాజన్ టాస్క్ అదేనంటూ బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. మీడియా చిట్ చాట్ చేసిన ఏలేటి ఆసక్తికర కామెంట్లు చేశారు.