ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు శనివారం సాయంత్రం శస్త్రచికిత్స విజయవంతంగా జరిగింది. తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన ఆయనకు ఎంఆర్ఐ పరీక్షల అనంతరం వైద్యులు ఆపరేషన్ నిర్వహించారు. వారం నుండి పది రోజుల విశ్రాంతి తర్వాతే ఆయన విధుల్లో చేరుతారని వైద్యులు తెలిపారు. దీంతో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ ద్వారా పవన్ ఆరోగ్యాన్ని ఆరా తీసి.. ధైర్యం చెప్పారు. తన ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేసిన ప్రధానికి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు.