Andhra Pradesh Weather Today: ఏపీపై ద్రోణి ప్రభావం ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇవాళ ఉత్తరాంధ్ర, కొస్తాలోని పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. అక్కడక్కడా పిడుగులుపడే అవకాశం ఉందని హెచ్చరించారు. వర్షాలతో పాటుగా పలు జిల్లాల్లో ఎండల తీవ్రత కొనసాగుతుందని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది రాష్ట్రంలోపై ఎల్నినో ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించినా వర్షాలు ఇంకా ఊపందుకోలేదు.