South Central Railway: దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాథుర్ బెల్లంపల్లి రైల్వే స్టేషన్ను సందర్శించి అభివృద్ధి పనులను సమీక్షించారు. ప్రయాణికుల సౌకర్యాల మెరుగుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మూడో ప్లాట్ఫాం నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని, ROH డిపో షెడ్డును విస్తరించాలని ఆదేశించారు. కార్మికుల సమస్యలపై వినతులను స్వీకరించి, పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. పలు రైళ్లకు హాల్టింగ్ కల్పించాలని సీపీఐ నాయకులు విజ్ఞప్తి చేశారు.