మెదక్, కామారెడ్డిలో ఉధృత వర్షాలతో రవాణా వ్యవస్థ దెబ్బతింది. రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మెదక్ జిల్లాలో విద్యార్థులు వరద నీటిలో చిక్కుకుని రక్షించబడ్డారు. మెదక్, ఖమ్మం, హైదరాబాద్ జిల్లాల్లో రానున్న 24 గంటట్లో కుండపోత వర్షపాతం నమోదు అవుతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. దీని వల్ల రవాణా వ్యవస్థకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. రద్దైన రైళ్ల వివరాలిలా ఉన్నాయి.