బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయకు ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ఖడ్ రాజీనామా చేయడంతో ఆ స్థానం ఖాళీ అయింది. దత్తాత్రేయకు ఆ పదవి ఇస్తే బీసీలకు న్యాయం జరుగుతుందని, తెలుగువారికి గౌరవం దక్కుతుందని రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్డీఏ కూటమి దత్తాత్రేయను ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తే ఇండియా కూటమితో మద్దతు ఇస్తానంటూ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.