Nellore District Temple Priest Died: నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నర్రవాడలోని శ్రీ వెంగమాంబ ఆలయంలో దసరా పండుగ రోజు విషాదం నెలకొంది. భక్తులతో రద్దీగా ఉన్న ఆలయంలో పూజారి సురేశ్ పూజలు చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. 108 సిబ్బంది నిర్లక్ష్యం, ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో సకాలంలో వైద్యం అందక ఆయన మృతి చెందారు. అయితే ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు.