తెలంగాణతో పాటు ఏపీలో దసరా పండుగ సందడి నెలకొంది. ఇప్పటికే స్కూళ్లకు, కాలేజీలకు సెలవులు ప్రకటించగా.. వీలు చూసుకుని సొంతూళ్లకు పయమవుతున్నారు నగరవాసులు. ఇప్పటికే చాలా మంది పల్లెబాట పట్టటంతో.. రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు కిక్కిరిసిపోతున్నాయి. అయితే.. ప్రస్తుతం తెలంగాణలో మహాలక్ష్మి పథకం అమల్లో ఉండటంతో.. గతేడాది కంటే ఈసారి బస్టాండ్లలో రద్దీ ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో.. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా టీజీఎస్ ఆర్టీసీ స్పెషల్ బస్సులను గణనీయంగా పెంచింది.