విజయదశమికి ఏపీలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు కానుంది. దసరాకు కొత్త పార్టీని ప్రకటించనున్నట్లు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు. సోమవారం విలేకర్ల సమావేశం నిర్వహించిన ఆయన.. పార్టీ ప్రకటన, రాజకీయ భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి పలు కీలక వివరాలను వెల్లడించారు. ఇక తాను స్థాపించబోయే పార్టీ తరుఫున సీఎం అభ్యర్థిగా తాను ఉండటం లేదని విజయసాయిరెడ్డి ప్రకటించారు. దేశభక్తి గల యువతకు తమ పార్టీలో ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు.