హైదరాబాద్ను AI డేటా సెంటర్ హబ్గా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్లో నెదర్లాండ్స్ సంస్థలతో కీలక ఒప్పందం కుదిరింది. ఫ్యూచర్ సిటీలో భారీ పెట్టుబడులతో అత్యాధునిక AI డేటా సెంటర్, పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్ రానున్నాయి. ఇది యువతకు ఉపాధి అవకాశాలు పెంచడమే కాకుండా, పర్యావరణహిత లక్ష్యాలను చేరుకోవడంలో సహాయపడుతుంది.