దిల్సుఖ్నగర్ జంట బాంబు పేలుళ్లకు నేటికి 13 ఏళ్లు పూర్తి అయింది. ఆ రోజు జరిగిన ఉగ్రదాడిలో 18 మంది దుర్మరణం చెందగా.. 130 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ కేసులో మొత్తం ఆరుగురు ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఎన్ఐఏ కోర్టులో హాజరు పరచగా ఉరిశిక్ష విధించింది. అయితే ఈ ఘటన జరిగి 13 ఏళ్లు గడిచినప్పటికీ.. అప్పటి గాయాలు మాత్రం ఇంకా హైదరాబాద్ నగర వాసులను వెంటాడుతున్నాయి.