ఏపీలోని దివ్యాంగులకు గుడ్ న్యూస్. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సులలో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనుంది. ఇంధ్రధనస్సు పేరుతో మార్చి 18వ తేదీ నుంచి ఈ పథకం అమలు చేయనున్నారు. స్త్రీశక్తి పథకం అమలయ్యే బస్సులలో మహిళలు, బాలికలతో పాటుగా దివ్యాంగులకు కూడా ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు. దివ్యాంగులకు ఎస్కార్టుగా వచ్చేవారికి 50 శాతం రాయితీ కల్పించనున్నారు. ఉచిత బస్సు ప్రయాణం లేని బస్సులలో దివ్యాంగులకు 50 శాతం రాయితీ కొనసాగుతుంది.