సదరం సర్టిఫికేట్ కలిగిన దివ్యాంగులు యూడీఐడీ కార్డును కూడా పొందాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ కార్డులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు వెళ్లాలనుకునే వారికి ఉపయోగపడనున్నాయి. 2020లో యూడీఐడీ కార్డు జారీపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా.. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు అందజేస్తున్న సదరం ధ్రువపత్రాలను యూడీఐడీగా మార్చి జారీ చేయాలని తాజాగా నిర్ణయించింది. ఫోన్లలో దరఖాస్తు చేసుకున్న వారికి పోస్టాఫీస్ ద్వారా లబ్ధిదారులకు కార్డులు అందించనున్నారు.