జగిత్యాల జిల్లా గొల్లపల్లికి చెందిన కడ మల్లేష్ అనే యువకుడు దుబాయ్లో బ్యాంకు లోన్ మోసం కేసులో చిక్కుకున్నాడు. చదువులేనితనం, అమాయకత్వంతో యజమాని చెప్పిన చోట సంతకాలు పెట్టి తన ప్రమేయం లేకుండానే లోన్ ఉచ్చులో పడ్డాడు. మూడు సంవత్సరాల కాంట్రాక్ట్ పూర్తయ్యాక స్వగ్రామానికి వెళ్లేందుకు ఎయిర్పోర్ట్కు చేరుకోగా.. లోన్ కట్టకపోవటంతో అతనిపై ట్రావెల్ బ్యాన్ విధించినట్లు అధికారులు తెలిపారు. దీంతో స్వగ్రామం రాలేక జైల్లోనే మగ్గిపోతున్నాడు.