తెలంగాణలో అవినీతి నిరోధక శాఖాధికారులు దూకుడు పెంచారు. మహబూబ్నగర్ జిల్లాలో ఆర్ఐ బాలసుబ్రమణ్యం రూ.4,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. కళ్యాణలక్ష్మి పథకం కోసం లంచం అడిగినట్టు ఫిర్యాదు అందింది. జులైలో 22 కేసులు నమోదు కాగా.. రూ.5.75 లక్షల నగదు, రూ.11.5 కోట్ల ఆస్తులు గుర్తించారు. అవినీతిపై ఫిర్యాదు చేయడానికి 1064 టోల్ ఫ్రీ నంబర్ను సంప్రదించాలని ఏసీబీ అధికారులు ప్రజలకు సూచించారు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.