నైరుతి బంగాళాఖాతం పరిసరాల్లోఉపరితల ఆవర్తనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రానున్న మరికొన్ని గంటల్లో అల్పపీడనంగా బలపడే సూచనలు ఉన్నాయని వెల్లడించారు. దీని ప్రభావంతో తెలంగాణలో నేటి నుంచి మూడ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అన్నారు. ఈ మేరకు హెచ్చరికలు జారీ చేసారు.