దేవాలయాల్లో తొక్కిసలాట ఘటనలపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలనే ఉద్దేశంతో.. మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ మంత్రివర్గ ఉపసంఘం ఆలయాల్లో తొక్కిసలాట ఘటనలు జరగకుండా నివారణ చర్యలు చేపట్టడంతో పాటుగా.. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆలయాలపై జరిగిన దాడులు, తీసుకున్న చర్యలను సైతం పర్యవేక్షించనుంది. ఈ మేరకు ఏపీ సీఎస్ విజయానంద్ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి.