ఆలయ హుండీ లెక్కింపు చేపట్టిన అధికారులు షాక్ అయ్యే సంఘటన చోటు చేసుకుంది. హుండీలో ఉన్న డబ్బులు లెక్కిస్తుండగా.. అందులో కొన్ని నోట్లు చూసి.. వారు అవాక్కయ్యారు. ఎందుకంటే అవి నకిలీ నోట్లు అని వారు గుర్తించారు. అదెక్కడో కాదు హైదరాబాద్ కర్మన్ఘాట్లో ఉన్న హనుమాన్ ఆలయంలోనే. ఈ ఘటన ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది.