జగిత్యాల జిల్లా తొంబర్రావుపేటకు చెందిన గడ్డం నర్సారెడ్డి బతుకుదెరువు కోసం సౌదీ అరేబియా వెళ్లి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆరు నెలలుగా మృత్యువుతో పోరాడి చివరికి ఓడిపోయాడు. అదే ఆరు నెలలుగా కొడుకు తిరిగి వస్తాడని ఎదురుచూసిన తల్లి.. తన కొడుకు లేడన్న వార్త విని తట్టుకోలేక కుప్పకూలిపోయింది. కొడుకు మరణించిన రెండు వారాలకే ఆమె కూడా తుదిశ్వాస విడిచింది. ఈ విషాద సంఘటన ఆ గ్రామంలో తీవ్ర దిగ్భ్రాంతిని నింపింది. ఒకే కుటుంబంలో ఇద్దరు మరణించడంతో ఆ ఊరిలో విషాదఛాయలు అలుముకున్నాయి.