మెదక్ జిల్లా చేగుంటలోని వైకుంఠధామంలో దొంగలు మానవత్వం మరచిన అమానుష ఘటన వెలుగు చూసింది. మృతుల శరీరంపై ఉండే ఆభరణాల కోసం దొంగలు చితి మంటలు చల్లారిన తర్వాత చితాభస్మాన్ని ఎత్తుకెళ్లి వెతుకుతున్నట్లు ఎస్సై చైతన్యరెడ్డి తెలిపారు. గ్రామానికి చెందిన మురాడి నర్సమ్మ, కర్రె నాగమణి అంత్యక్రియలు జరిగిన స్థలంలో ఈ ఘోరం జరిగింది. పోలీసులు నిందితులను త్వరలో పట్టుకుంటామని తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.