ఉల్లి ధరలు పడిపోవటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గద్వాల జిల్లాలో ఓ రైతు రెండెకరాల్లో ఉల్లి సాగు చేసి.. రూ. 2 లక్షలు పెట్టుబడి పెట్టాడు. క్వింటాల్ రూ. 300 ధర పలుకుతుండటంతో నష్టపోయి, పంటను ప్రజలకు ఉచితంగా పంచాడు. కౌలు, పెట్టుబడి కోల్పోయిన రైతుకు ప్రభుత్వం అండగా నిలవాలని ప్రజలు కోరుతున్నారు.