ఒకప్పుడు ఫ్యాక్షన్ గొడవలకు మారు పేరుగా నిలిచిన ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉగ్రవాద కదలలికలు కలకలం రేపుతున్నాయి. శనివారం ఐబీ అధికారులు, పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టి ఒకర్ని అదుపులోకి తీసుకున్నాయి. కోట కాలనీలో నూర్ మహమ్మద్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతడఉ పాకిస్థాన్లోని ఉగ్రవాద సంస్థలు, దాని నాయకులకు ఫోన్లు చేస్తూ, చాటింగ్ చేస్తున్నాడని భావిస్తున్నారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.