శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో ఆదివారం హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. టీడీపీ, వైసీపీ శ్రేణులు పరస్పరం దాడులు చేసుకున్నాయి. దీనికంతటికీ వైసీపీ నుంచి ఓ నేత బీజేపీలోకి చేరేందుకు సిద్ధపడటమే కారణమని తెలిసింది. కృష్ణాపురం జమీర్ అనే వ్యక్తి వైసీపీ నుంచి బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. అయితే ఇతను బీజేపీలో చేరడాన్ని టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే ధర్మవరంలో ఏర్పాటు చేయించిన ఫ్లెక్సీలను టీడీపీ శ్రేణులు చించివేశాయి. ఇదే రెండు వర్గాల మధ్య దాడులకు కారణమైనట్లు తెలిసింది.