నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం.. ప్రముఖుల సంతాపం, హైదరాబాద్‌కు చంద్రబాబు

10 months ago 18
Nandamuri Padmaja Died: నందమూరి కుటుంబంలో విషాదం నెలకొంది. నందమూరి తారక రామారావు కుమారుడు జయకృష్ణ భార్య పద్మజ మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో .. ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. పద్మజ దగ్గుబాటి వెంకటేశ్వరరావు సోదరి. ఈ విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు నాయుడు హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరారు. ఆమె మృతితో నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
Read Entire Article