Naxalism will end by 2026: నిజామాబాద్లో పసుపు బోర్డు జాతీయ కార్యాలయ ప్రారంభోత్సవంలో అమిత్ షా మాట్లాడుతూ 2026 నాటికి దేశాన్ని నక్సల్ రహితంగా మారుస్తామని ప్రకటించారు. నక్సలైట్లు లొంగిపోతే పునరావాసం కల్పిస్తామని, లేదంటే నిర్మూలిస్తామని హెచ్చరించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఢిల్లీకి ఏటీఎంలా మార్చిందని ఆరోపించారు. పసుపు బోర్డు ఏర్పాటుతో నిజామాబాద్ పసుపు అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి అవుతుందని తెలిపారు.