Ajay Devgn Multiplex in Hyderabad: బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్గణ్ హైదరాబాద్ నగరంలోలో తన లగ్జరీ మల్టీప్లెక్స్ 'దేవ్గణ్ సినీక్స్'ను ప్రారంభించనున్నారు. కర్మాన్ఘాట్లోని కొలోసియం మాల్లో ఏడు స్క్రీన్లతో ఈ ప్రీమియం థియేటర్ 2026లో అందుబాటులోకి రానుంది. డాల్బీ సౌండ్, లగ్జరీ సీట్లతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించనుంది. ఇప్పటికే మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి స్టార్లు థియేటర్లు ప్రారంభించిన జాబితాలో అజయ్ దేవ్గణ్ కూడా చేరారు.