చెడు వ్యసనాలకు బానిసైన ఓ పూజారి దారుణ హత్యకు పాల్పడ్డాడు. బంగారు నగల కోసం గుడికి వచ్చిన ఓ మహిళను కిరాతకంగా చంపేశాడు. నగలు దోచుకొని మృతదేహాన్ని మూడ్రోజుల పాటు గర్భగుడిలోనే ఉంచి ఆ తర్వాత మాయం చేశాడు. 2022లో మేడ్చల్ జిల్లాలో ఈ ఘటన సంచలనం సృష్టించగా.. తాజాగా జిల్లా కోర్టు హత్య చేసిన పూజారికి యావజ్జీవ శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.