బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సొంత పార్టీ నాయకులపై చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. తనపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చేసిన విమర్శలకు పరోక్షంగా బదులిస్తూ ఆమె తీవ్రంగా స్పందించారు. తనపై విమర్శలు వచ్చినప్పుడు పార్టీ నాయకులు స్పందించకపోవడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీని వెనుక పెద్ద నాయకుడి కుట్ర ఉందని ఆరోపించారు. కేసీఆర్ లేకపోతే జగదీష్ రెడ్డికి గుర్తింపు ఉండేది కాదని, ఆయన్ను 'లిల్లీపుట్'గా అభివర్ణిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.