జీడిమెట్లలో 16 ఏళ్ల కూతురు తన ప్రియుడితో కలిసి కన్నతల్లినే హతమార్చిన ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ మేరకు అసలేం జరిగిందో నిందితురాలు చెల్లి చెప్పింది. పక్కా పథకం ప్రకారమే తన అక్క.. ఆమె ప్రియుడితో కలిసి తన తల్లిని చంపేసిందని తెలిపింది. తనకు ఏవేవో మాటలు చెప్పి బయటకు పంపించారని చెప్పింది. తాను వచ్చి చూసేసరికి రక్తపు మడుగుల్లో తన తల్లి ఉందని వెల్లడించింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.