ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్లో విభేదాలు తారాస్థాయికి చేరడంతో కొండా మురళి గాంధీభవన్లో మల్లు రవిని కలిసి ఆరు పేజీల లేఖ అందజేశారు. వరంగల్లో రెండు రిజర్వు స్థానాల కోసం కృషి చేశానని, రేవంత్ రెడ్డి సీఎం కావాలని కోరుకుంటున్నానని ఆయన తెలిపారు. తనను రెచ్చగొట్టొద్దని, బీసీలకు న్యాయం చేస్తానని, రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యమని కొండా మురళి స్పష్టం చేశారు.