ఇల్లందు మండల విద్యాధికారి (ఎంఈఓ) ఉమాశంకర్పై ఉపాధ్యాయుడు శంకర్ దాడి చేయడం విద్యా వ్యవస్థలో కలకలం రేపింది. రిజిస్టర్లో మధ్యాహ్నం సంతకం ముందుగా చేయడాన్ని ఎంఈఓ ప్రశ్నించారు. దీంతో ఆగ్రహించిన ఉపాధ్యాయుడు శంకర్, విచక్షణ కోల్పోయి కర్రతో విద్యాధికారిపై దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ఎంఈఓ చేతికి గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఎంఈఓ ఉమాశంకర్ పోలీసులకు.. జిల్లా విద్యాధికారికి ఫిర్యాదు చేయడంతో, ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.