Narasaraopet Doctor Family Suicide: పల్నాడు జిల్లా నరసరావుపేటలో డాక్టర్ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఓ లాడ్జిలో భార్య, మూడేళ్ల కూతురితో కలిసి మత్తు ఇంజెక్షన్ తీసుకుని డాక్టర్ ఆత్మహత్యాయత్నం చేశారు. భార్య, కుమార్తె చనిపోగా.. డాక్టర్ గోపి పరిస్థితి విషమంగా ఉంది. అతడు చికిత్సపొందుతూ ఇవాళ ఆస్పత్రిలో చనిపోయారు. మూడేళ్ల కుమార్తె ఆరోగ్య పరిస్థితి చూసి కలతచెంది ప్రాణాలు తీసుకున్నారు. ఒకే కుటుంబంలో ముగ్గురు చనిపోవడం తీవ్ర విషాదం నింపింది.