Narsapur Rs 2.27 Crores Cash Seized In Pastor House: పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం లక్ష్మణేశ్వరానికి చెందిన పాస్టర్ జాన్ బాబూరావు ఇంట్లో పోలీసులు తనిఖీలు చేశారు. ఆయన ఇంట్లో ఏకంగా రూ.2.27 కోట్ల డబ్బుల్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బులకు సరైన ఆధారాలు చూపించకపోవడంతో ఐటీ అధికారులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు. పాస్టర్ దగ్గర ఇంత భారీ మొత్తంలో డబ్బులు ఎందుకు ఉన్నాయో ఆరా తీస్తున్నారు.