తెలంగాణలో పిల్లల చదువులకు కొత్త ఊపు రానుంది! సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో, కార్పొరేట్ స్థాయి వసతులతో నర్సరీ నుంచి 4వ తరగతి వరకు కొత్త స్కూళ్లు రాబోతున్నాయి. ఈ స్కూళ్లలో చదివే విద్యార్థులకు బడిలోనే పాలు, అల్పాహారం, మధ్యాహ్న భోజనం కూడా అందిస్తారు. ఈ స్కూళ్లలో విశాలమైన ఆట స్థలాలతో ఆహ్లాదకరమైన వాతావరణం కలిగి ఉండబోతున్నాయి. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఈ మార్పులు మొదలవుతాయి!