ఓ ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అన్నట్లుగా.. నలుగురు విద్యార్థుల మదిలో మెదిలిన ఐడియా పోలీసులను పరుగులు తీయించింది. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఎన్టీఆర్ జిల్లా పటమటకు చెందిన నలుగురు విద్యార్థులు రాత్రివేళ ఇంట్లో చెప్పకుండా బయటకు వచ్చారు. సైకిళ్లపై 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న బందర్ బీచ్కు వెళ్లారు. అయితే తెల్లవారుజామున పిల్లలు లేని విషయాన్ని గుర్తించిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. చివరకు ప్రత్యేక బృందాల సాయంతో వారి ఆచూకీని కనిపెట్టి తల్లిదండ్రులకు అప్పగించారు పోలీసులు..