ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పుట్టపాకకు చెందిన ఇద్దరు చేనేతలకు జాతీయ చేనేత పురస్కారం-2024 లభించింది. దేశవ్యాప్తంగా 19 మంది ఎంపిక కాగా.. తెలంగాణ నుంచి ఇద్దరికి పురస్కారాలు వరించాయి. యువ చేనేత విభాగంలో గూడ పవన్, మార్కెటింగ్ విభాగంలో గజం నర్మద ఎంపిక కాగా.. ఆగస్టు 7న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా వీరు పురస్కారాలు అందుకోనున్నారు.