నల్లగొండ జిల్లా డిండి మండలంలో ముగ్గురు గొర్రెల కాపరులు దుందుభి వాగు మధ్యలో చిక్కుకున్నారు. భారీ వర్షాల కారణంగా వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పది రోజులుగా నిస్సహాయ స్థితిలో ఉన్నారు. అధికారులు డ్రోన్ ద్వారా నిత్యావసరాలు, మందులు పంపించారు. వారిని రక్షించాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.