పోక్సో కేసులో నల్గొండ జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నాలుగేళ్ల క్రితం జరిగిన అత్యాచారం కేసులో నిందితుడు షేక్ మహ్మద్ ఖయ్యూంకు 50 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. దీంతో పాటుగా నిందితుడికి రూ.85 వేల జరిమానాతో పాటుగా బాధితురాలికి రూ.7 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాల కింద ఈ శిక్ష ఖరారు చేస్తూ ఎస్సీ, ఎస్టీ కోర్ట్ జడ్జి రోజా రమణి తీర్పు వెల్లడించారు. ఆ వివరాలు..