ప్రకాశం జిల్లాలో పులి సంచారం భయాందోళనలు కలిగిస్తోంది. అర్ధవీడు మండలంలో మూడు నెలలుగా పులి సంచరిస్తూ పశువులపై దాడి చేస్తున్నట్లు స్థానికులు చెప్తున్నారు. అటవీ శాఖ అధికారులు పులి పాదముద్రలను సేకరించి ప్రజలను అప్రమత్తం చేశారు. నల్లమల అటవీ ప్రాంత ప్రజలు సాయంత్రం వేళల్లో అడవిలోకి వెళ్లకూడదని సూచించారు.