నవంబర్ 14 లోపు వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ సీబీఐ కోర్టు జారీచేసిన ఉత్తర్వులపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మెమో దాఖలు చేశారు. తాను వ్యక్తిగతంగా కోర్టుకు రావాలంటే ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు అవసరమని.. అది యంత్రాంగానికి భారమని జగన్ అందులో పేర్కొన్నారు. తప్పందంటే వచ్చేందుకు తాను సిద్ధమేనన్నారు. ప్రత్యామ్నాయం కింద వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యేందుకు తనకు ఇబ్బంది లేదంటూ వైఎస్ జగన్ మెమో దాఖలు చేశారు. దీనిపై సీబీఐ కోర్టు స్పందించాల్సి ఉంది.