జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచిన నవీన్ యాదవ్కు సీఎం రేవంత్ రెడ్డి కీలక పదవి కట్టబెట్టేందుకు సిద్ధమయ్యారు. ప్రభుత్వ విప్ పదవి ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. సామాజిక, ప్రాంతీయ సమీకరణాలతో పాటు, యాదవ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలనేది కాంగ్రెస్ వ్యూహం. ఈ పదవితో నవీన్ యాదవ్ పలుకుబడి పెరిగి, గ్రేటర్ హైదరాబాద్లో పార్టీ బలోపేతం అవుతుందని అంచనా.