జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత మాగంటి గోపీనాథ్ గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. అతడి మరణంపై తల్లి మహానంద కుమారి చేసిన ఆరోపణలు వివాదానికి కేంద్రంగా మారాయి. ఆసుపత్రిలో తన కుమారుడిని చూడనివ్వలేదని, కేటీఆర్ వచ్చిన తర్వాతే మరణాన్ని ప్రకటించారని ఆమె అన్నారు. వైద్యుల నిర్లక్ష్యం, భద్రతా లోపాలపై కూడా ఆరోపించారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేత బండి సంజయ్ పూర్తి విచారణను డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేస్తే విచారణకు సిద్ధమని చెప్పారు.