మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డులో ఓటమి పాలైన అభ్యర్థి తాను పోలింగ్కు ముందు పంచిన డబ్బులు, చీరలు తిరిగి ఇవ్వమని ఇంటింటికీ తిరిగి వసూలు చేశారు. తనకు ఓటేయలేదని ప్రతి గడపకు తిరిగి డబ్బులు, మందు, చీరలు వసూలు చేసింది. దీనిపై ఓటర్లు మండిపడుతున్నారు. ఇవ్వడం ఎందుకు? తిరిగి అడగడం ఎందుకు అంటూ ఆగ్రం వ్యక్తం చేశారు.